మంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 28 : అంతర్జాతీయ సహకార సంవత్సరము-2025 సందర్భంగా సోమవారం మంచిర్యాలలోని యూ నివర్సల్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా సహకార అధికారి మోహన్, బ్యాంకు చైర్మన్ వీ వినయ్కుమార్, ఇన్చార్జి సీఈవో కేవీఎస్ఎన్ మూర్తి, జిల్లా సహకార అధికారి బీ. మోహన్ పాల్గొని లోను రికవరీ గురించి స భ్యులకు వివరించారు.
తమ బ్యాంకు చిన్న.. మధ్య తరగతి కుటుంబాలకు అండగా ఉం టూ వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందన్నా రు. ఈ సదస్సులో బ్యాంకు డైరెక్టర్లు కే.సుబ్రహ్మణ్యేశ్వర రావు, కృష్ణమూర్తి, ప్రసాదరావు, శ్రీదేవి, రాయలింగు, భాను ప్రకాశ్, బక య్య, రత్నం, సుశీల, విజయలక్ష్మి, ఖాతాదారులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.