సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 5 : సింగరేణి లో అనే క హక్కులు సాధించిన టీబీజీకేఎస్ బలోపేతానికి కృషి చేస్తామని ఆ యూనియన్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. శుక్రవారం నస్పూర్కాలనీలోని యూనియన్ కార్యాలయం వద్ద సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పలువు రు కార్మికులకు ఆయన యూనియన్ సభ్యత్వాన్ని అందజేశారు.
ఈ సందర్భం గా రాజిరెడ్డి మాట్లాడుతూ టీబీజీకేఎస్ యూనియన్ కోలిండియాలోని అనేక హక్కులను సింగరేణి కార్మికులకు సాధించిపెట్టిందన్నారు. తమ హయాంలో కార్మికుల సంక్షేమాభివృద్ధికి కృషి చేసినట్లు చెప్పారు. సింగరేణిలో దాదాపు 20 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. ఈనెల 24న గోదావరిఖనిలో జనరల్బాడీ సమావేశం నిర్వహిస్తున్నామని, అనంతరం కేంద్ర కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు.
కేంద్ర కమిటీ తర్వాత, ఏరి యా కమిటీలు, పిట్ కమిటీలను నియమిస్తామని తెలిపారు. యూనియన్ నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమా న్ని పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాదాసు రాంమూర్తి, పెట్టం లక్ష్మణ్, పానుగంటి సత్తయ్య, రత్నాకర్రెడ్డి, తొంగల రమేశ్, పొగాకు రమేశ్, గొర్ల సంతోష్, బానోత్ రాజూనాయక్, సాధుల భాస్కర్, ఎండీ లాలా, కుర్మ వికాస్, ఉత్తేజ్రెడ్డి, మాధవరెడ్డి, మారం శ్రీను పాల్గొన్నారు.