ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్, డిసెంబర్ 21 : జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో నిర్వహిస్తున్న అండర్ -14 బాలబాలికల రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు గురువారం రెండో రోజూ హోరాహోరీగా సాగాయి. గిరిజన సంక్షేమ శాఖ డీడీ రమాదేవి, ఏటీడీవో క్షేత్రయ్య, వాంకిడి సీఐ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై పోటీలు ప్రారంభించారు.
ఈ సం దర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకొని అత్యుత్తమ ప్రతిభ కన బరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్ధవ్, ఎస్జీఎఫ్ కార్యదర్శి సాంబశివరావు, జీసీసీ మేనేజర్ పాపారావు, క్రీడల అధికారి మీ నారెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి సట్ల శంకర్, లక్ష్మణ్, విద్యాసాగర్, రమేశ్, రామయ్య, నరేందర్, కృష్ణమూర్తి, శంకర్ తదితరులు ఉన్నారు.