మంచిర్యాల ఏసీసీ, ఏప్రిల్ 6 : జిల్లాలో నిబంధనలు పాటించని ప్రైవేట్ హాస్పిటల్స్పై టీఎస్ఎంసీ(తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్) బృందం కొరడా ఝుళిపిస్తున్నది. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్లోని చంద్ర మల్టీ స్పెషాలిటీ అండ్ క్రిటికల్ కేర్, లోటస్, అమృత హాస్పిటల్స్లలో బృందం సభ్యులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
మంచిర్యాల జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా 12 దవాఖానలు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు అందినట్లు టీఎస్ఎంసీ మెంబర్, లీగల్ అండ్ ఆంటీ క్రాకర్ కమిటీ మెంబర్ డాక్టర్ యెగ్గేన శ్రీనివాస్ తెలిపారు.
ఈ మేరకు జిల్లాలోని వివిధ శాఖల నుంచి ఐదుగురు అధికారులు బృందంగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హాస్పిటల్స్ నిర్వహణపై నివేదికలు తయారు చేసి పై అధికారులకు అందిస్తామని, వారి ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. టీఎస్ఎంసీ కో ఆప్షన్ మెంబర్ డా.సంతోష్, మెడికల్ అధికారి డా.అశోక్కుమార్, డ్రగ్ ఇన్స్పెక్టర్ చందన, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.