అభివృద్ధి, పురోగతియే ధ్యేయంగా దేశరాజకీయాల్లో మార్పు కోసం తెలంగాణ రాష్ట్ర సమితి నవశకం ప్రారంభించింది. జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్పు చెందింది. ఈ చారిత్రక ఘటనకు విజయ దశమి నాడు తెలంగాణ భవన్ వేదికైంది.
ఈ సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయా జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులు హాజరయ్యారు. జాతీయ పార్టీగా మార్చుతూ సీఎం కేసీఆర్ ప్రకటించిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సంబురాలు జరిగాయి.