ఉట్నూర్, సెప్టెంబర్ 10 : చాకలి ఐలమ్మ పోరాటం నేటి తరానికి ఆదర్శమని జీవవైవిధ్య మేనేజ్మెంట్ జిల్లా కమిటీ సభ్యుడు మర్సుకోల తిరుపతి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎన్టీఆర్చౌక్లో శనివారం చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాలర్పించారు. కార్యక్రమంలో గౌడ హక్కుల సంఘం నాయకుడు లింగాగౌడ్, శ్రీనివాస్, గంగాధర్, కాల్వ రవి, సోనేరావ్, ధర్మనాయక్, భూమన్న, ధర్మరాజు, స్వామి, రాజేశ్, బొడ్డు కిరణ్, వెంకటేశ్, కిరణ్, సతీశ్, రాజేశ్వర్, విజయ్, రాజశేఖర్, దేవ్రావ్ పాల్గొన్నారు.
బోథ్ మండలంలో..
బోథ్, సెప్టెంబర్ 10 : బోథ్, ధన్నూర్(బీ) గ్రామాల్లో చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి నిర్వహించారు. బోథ్లోని రజక సంఘ భవనంలో సర్పంచ్ సురేందర్యాదవ్, నాయకులు ఆమె చిత్రపటానికి పూజలు చేసి నివాళులర్పించారు. ధన్నూర్(బీ)లో రజక సంఘం డివిజన్ అధ్యక్షుడు మునిమాల గంగయ్య, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, నాయకులు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రవీందర్, లక్ష్మి, లక్ష్మణ్, స్వామి, కట్టా భూమేష్, రజక సంఘం నాయకులు, సభ్యులు, యువకులు పాల్గొన్నారు.
ఇచ్చోడలో..
ఇచ్చోడ, సెప్టెంబర్ 10 : మండల కేంద్రంలో రజక సంఘం నాయకులు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రజకుల సంఘం మండలాధ్యక్షుడు అరుగుల గణేశ్, గంగాధర్, నారాయణ, హరీశ్, శేఖర్, దేవన్న, ప్రవీణ్, మహేశ్, కృష్ణ, చైతన్య, రవి, తదితరులు పాల్గొన్నారు.
రజక సంఘం ఆధ్వర్యంలో..
ఎదులాపురం, సెప్టెంబర్ 10 : జిల్లా కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. రిమ్స్ ఎదుట ఉన్న ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు, పట్టణ అధ్యక్షుడు అశోక్, నాయకులు నర్సయ్య, దొనకొండ నాగన్న, శ్రీనివాస్, జానకొండ తిరుపతి, బండి ఆశన్న, నారాయణ, బుచ్చన్న , మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు.
జైనథ్లో..
జైనథ్, సెప్టెంబర్ 10 : తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని మండల కేంద్రంలో రజకసంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రజక సంఘం మండలాధ్యక్షుడు కొండ్ర రాజు, సర్పంచ్ దేవన్న, ఎంపీటీసీ సుదర్శన్, నాయకులు పాల్గొన్నారు.
తేజాపూర్లో..
నేరడిగొండ, సెప్టెంబర్ 10 : తేజాపూర్ గ్రామంలో సర్పంచ్ ప్రపూల్చందర్ రెడ్డి, రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో రజక సంఘం గ్రామ అధ్యక్షుడు వెంకటరమణ, సంఘం ప్రతినిధులు రాజు, రమేశ్, సతీశ్, అర్జున్, గంగయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.