అటవీ గిరిజన, ఆదివాసీ గ్రామాల ప్రజలకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆదుకుంటున్నది. మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు 22 అటవీ గ్రామాల్లో వర్షాకాలంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా కడెం వాగు ఇరువైపులా విద్యుత్ టవర్ల నిర్మాణ పనులు చేపడుతున్నది. దీంతో అటవీ గ్రామాల్లో విద్యుత్ ఇబ్బందులు తీరనున్నాయని గిరిజనులు,ఆదివాసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– కడెం, సెప్టెంబర్ 9
అటవీ గిరిజన, ఆదివాసీ గ్రామాల ప్రజలకు మరింత మెరుగైన విద్యుత్ సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం మరింత కృషి చేస్తున్నది. ఇప్పటికే అటవీ ప్రాంత గ్రామాలకు నిరంతర విద్యుత్ సరఫరాను అందించగా, వర్షాలు, ఇతర గాలిదుమారాల కారణంగా సమస్యలు తలెత్తితే రాత్రులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని భావించిన సర్కారు అటవీ ప్రాంత గ్రామాలకు మరింత మెరుగైన విద్యుత్ అందించాలని నిర్ణయించింది. అయితే కడెం మండలంలోని మొత్తం 28 గ్రామ పంచాయతీలుండగా, అందులో గంగాపూర్, కొర్రతాండ, రాణిగూడెం, బాబానాయక్తాండ, అల్లంపల్లి 5 పంచాయతీలు పూర్తి అటవీ ప్రాంతంలోనే ఉంటాయి. ఈ గ్రామాలకు ప్రస్తుతం ఉన్న రోడ్ల ఆధారంగా విద్యుత్ సరఫరాను అందించా లంటే పూర్తి అటవీ ప్రాంతం అయినప్పటికీ విద్యుత్ అధికారుల కృషి వల్ల నిరంతర విద్యుత్ను అందిస్తున్నారు. కానీ భారీ వర్షాల కారణంగా సరఫరాలో సమస్యలు తలెత్తున్న తరుణంలో అధికారులు ఈ గ్రామాలపై మరింత దృష్టి సారించారు. అయితే ఈ 5 పంచాయతీల పరిధిలో మొత్తం 22 గ్రామాలున్నాయి. గంగాపూర్ పంచాయతీ పరిధిలో దత్తోజిపేట, కొలం గూడ, నాయకపుగూడెం, దేవునిగూడెం, రాజంపేట, కొర్రతాండ పంచాయతీ పరిధిలో దుబ్బతాండ, చౌడుతాండ, రాణిగూడెం పంచాయతీ పరిధిలో మొర్రిపేట, లక్ష్మీపూర్, బాబానాయక్తాండ పంచాయతీ పరిధిలో మీసాల భూమన్నగూడెం, గంగన్నపేట, మంగల్సింగ్తాండ, అల్లంపల్లి పంచాయతీ పరిధిలో పాలరేగడి, అద్దాల తిమ్మాపూర్, గుర్రంమదిర, కనిరాంతాండ, చింతగూడ గ్రామాలున్నాయి. ఈ గ్రామాలకు ప్రస్తుతం త్రీఫెజ్ విద్యుత్ను కూడా అధికారులు సరఫరా చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న రోడ్డు మార్గం ద్వారా దూరభారం అధికంగా ఉండడంతో వర్షాలకు ఇబ్బందులు తలెత్తుతున్న తరుణంలో అధికారులు శాశ్వత పరిష్కారాన్ని ఆలోచించారు.
అటవీ ప్రాంతంలోని 22 గ్రామాలకు ఇబ్బందులు లేకుండా కడెం వాగు మీదుగా ఇరువైపులా రెండు విద్యుత్ టవర్లను ఏర్పాటు చేసి సరఫరా అం దించాలనే లక్ష్యంతో అధికారులు ఇదివరకే సర్వేలు పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన టవర్ల నిర్మాణ పనులు సైతం చేపట్టారు. అయితే కడెం వాగు మీదుగా గంగాపూర్ పంచాయతీ వరకు దూరం తక్కువగా ఉండడంతో పాటు, అటవీ ప్రాంతం లేని కారణంగా దూరభారంతో, అటవీ సమస్య లేనందున ఈ ప్రాంతం గుండాఆ గ్రామాలకు విద్యుత్ అందిస్తే అంతరా యానికి సంబంధించిన సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం ఉంటుందని, ఆ దిశగా పనులు చేపడుతున్నారు. అయితే గతంలో అక్కడి పనుల పురోగతిని తెలుసుకునేందుకు ఎస్ఈ ఆధ్వర్యంలో అధికారులు కడెం వాగు మీదుగా నాటు పడవల్లో ఆవతలి వైపు గ్రామానికి చేరుకొని పనులను పరిశీలించారు. ఈ పనులు త్వరగతిన పూర్తి చేసి గ్రామాలకు మరింత మెరుగైన విద్యుత్ను అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఖానాపూర్ మండలంలోని బీర్నంది మీదుగా, కడెం వాగుపై నుంచి కడెం మండలంలోని గంగాపూర్తో పాటు, 22 గ్రామాలకు మరిం త మెరుగైన విద్యుత్ను అందించేలా వాగుకు ఇరువైపులా టవర్ల పనులు కొనసాగు తున్నాయి. అలాగే అవతలి గ్రామాల్లో కూడా పనుల పురోగతిని తెలుసుకునేందుకు ఇటీవలే నాటు పడవ ద్వారా అక్కడికి చేరుకొని పనులు పరిశీలించాం. వీలైనంత త్వర గా పనులు పూర్తి చేసి, అక్కడి గ్రామాలకు త్రీఫెజ్తో పాటు, గృహ అవసరాల విద్యుత్కు ఇబ్బందులు లేకుండా శాశ్వత చర్యలు తీసుకుంటున్నాం.
– కెశెట్టి శ్రీనివాస్, ఏడీఏ, ఖానాపూర్.