శ్రీరాంపూర్, జూన్ 15 : శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఆఫీస్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు అక్కడిక్కడే మృతి చెందగా, భార్య కు తీవ్రంగా గాయాలయ్యాయి. ఎస్ఐ రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మందమర్రి మం డలం శంకరపల్లికి చెందిన దర్శనాల రమేశ్ (42), కుమారుడు సాయితేజ (14), భార్య వెన్నలతో కలిసి గోదావరిఖని వైపు నుంచి మందమర్రికి బైక్పై వెళ్తున్నాడు. శ్రీరాంపూర్ వైపు నుంచి ఎదురుగా వస్తున్న సిమెంట్ లోడ్తో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి రమేశ్, కుమారుడు సాయితేజ అక్కడికక్కడే మృతి చెందగా, వెన్నలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రురాలిని మంచిర్యాల దవాఖానకు తరలించామని , ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
శంకర్పల్లిలో విషాదం..
మందమర్రి జూన్ 15: శ్రీరాంపూర్ సింగరేణి జీఎం కార్యాలయం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం శంకర్పల్లి గ్రామంలో విషాదాన్ని నింపింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దర్శనాల రమేశ్, వెన్నెల దంపతులకు సూర్యతేజ, సువిష్ట కుమారుడు, కూ తురు ఉన్నారు. కుమారుడు అనారోగ్యంగా ఉండడంతో చికిత్స కోసం ముగ్గురు బైక్పై గో దావరిఖని దవాఖానకు వెళ్లారు. చికిత్స అనంతరం తిరిగి గ్రామానికి వస్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టగా రమేశ్, సూర్యతేజ అక్కడికక్కడే మృతి చెందగా, వెన్నెల గాయాలతో బయట పడింది. ప్రమాదం విషయం తెలియగానే గ్రామస్తులు ఘటనా స్థలానికి తరలివెళ్లారు.
ఊత్కూర్ చౌరస్తాలో ..
లక్షెట్టిపేట, జూన్ 15: పట్టణంలోని ఊత్కూర్ చౌరస్తాలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొ నడంతో చందారం గ్రామానికి చెందిన ఇస్లా వత్ ఉపేందర్(28) మృతి చెందినట్లు ఎస్ఐ లక్ష్మణ్ గురువారం తెలిపారు. ఉపేందర్ గ్రా మం నుంచి బైక్పై లక్షెట్టిపేటలోని ఊత్కూ ర్ చౌరస్తా వద్ద గల ప్రైవేట్ ఫైనాన్స్కు వస్తు న్నా డు. వెనుకాల నుంచి మరో బైక్ వచ్చి ఢీకొట్ట డంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే లక్షెట్టిపేట సర్కారు దవా ఖానకు తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్కు తరలి స్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు తెలిపారు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
గుండెపోటుతో ఇద్దరు ..
నెన్నెల, జూన్ 15 : మండలంలోని కోనంపేట గ్రామానికి చెందిన గుంటి శ్రీశైలం (50) కుష్న పల్లి గ్రామంలోని మల్లన్న ఆలయ పూజారిగా చేస్తున్నాడు. అలాగే ఆవుడం గ్రామ పంచా యతీ పారిశుధ్య కార్మికుడు కామేర శ్రీనివాస్ (35) గుండెపో టుతో మృతి చెందారు. శ్రీశై లం ఉదయాన్నే కోనంపేటలోని తన తోటకు వెళ్లాడు. అక్కడే ఛాతీలో నొప్పి రావడంతో ఇంటికి తిరిగి వచ్చి కుటుంబ సభ్యులకు చెప్పి పడి పోయాడు. వెంటనే ఆయనను దవాఖా నకు తరలిస్తుండగా మృతి చెందాడు. అలాగే పంచాయతీ కార్మికుడు శ్రీనివాస్ పల్లెప్రగతి దినోత్సవానికి హాజరయ్యాడు. అనంతరం ఇంటికి వెళ్లి భోజనం చేసేందుకు కూర్చుంటుడగా గుండెపోటుతో అక్కడే పడిపోయాడు. గమనించిన తల్లి చుట్టుపక్కలా వారిని పిలిచి చూడగా అప్పటికే మృతి చెందాడు. కొన్ని రో జులుగా ఛాతీలో నొప్పి వస్తున్నదని శ్రీనివాస్ తోటి కార్మికులతో చెప్పకునేవాడని పంచాయతీ సిబ్బంది తెలిపారు.