నమస్తే నెట్వర్క్, మార్చి 7 : మహాశివరాత్రికి శైవక్షేత్రాలు సర్వాంగ సుందరం గా ముస్తాబయ్యాయి. మంచిర్యాల జిల్లాలోని గోదావరి తీరం వెంట శివాలయాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ప్రసిద్ధ వేలాల మల్లన్న, కత్తెరశాల మల్లికార్జున, బుగ్గ రాజరాజేశ్వర స్వామి, ఆసిఫాబాద్ జిల్లా ఈస్గాం శివమల్లన్న తదితర ఆలయాల కమిటీలు ఏర్పాట్లు పూర్తి చేశా యి.
శివ పార్వతుల కల్యాణోత్సవానికి భ క్తులు వేలాదిగా తరలిరానుండగా, ఆయా ప్రాంతాలకు ఆర్టీసీ.. బస్సులు నడిపిస్తున్నది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులుశాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.