బోథ్, డిసెంబర్ 3 : భారత రాజ్యాంగంపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని బోథ్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి బీ హుస్సేన్ అన్నారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్లో భాగంగా విద్యార్థులకు ఏర్పాటు చేసిన వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి పంద్రం శంకర్, న్యాయవాదులు కుమ్మరి విజయ్కుమార్, ఏఎస్ఐ ఖైసర్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, పీసీ విజయ్, కోర్టు సిబ్బంది శశికళ, స్రవంతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.