సమైక్య పాలనలో చీకట్లో మగ్గిన గిరిగూడేలు, స్వరాష్ట్రంలో అభివృద్ధి బాట పడుతున్నా యి. టీఆర్ఎస్ సర్కారు ఐదు వందల జనాభా కలిగిన పల్లెలను ప్రత్యేక పంచాయ తీలుగా ఏర్పాటు చేయగా, గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నాయి. ఇక ఆదివాసుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా అనేక పథకాలు అమలు చేస్తూనే.. ఊరూరా మౌలిక వసతులు కల్పిస్తున్నది. సకల సౌకర్యాలతో పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసి అడవిబిడ్డలకు కార్పొరేట్కు దీటుగా నాణ్యమైన విద్యనందిస్తున్నది. పంటల సాగుకు రైతన్నలకు ప్రోత్సాహమంది స్తూనే.. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తున్నది. అడవిబిడ్డల సంస్కృ తీ సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తూ.. వారి పండుగలను అధికారికంగా నిర్వహి స్తున్నది. రూ. 25 కోట్లతో జోడెఘాట్ను పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో పాటు హైదరాబాద్లో గిరిజనుల ఆత్మగౌరవ ప్రతీకలుగా ఆదివాసీ, బంజారా భవనాలు నిర్మించింది.
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : గతపాలకుల పట్టింపులేనితనంతో చీకట్లో మగ్గిన ఆదివాసీ జనం.. స్వరాష్ట్రంలో అభివృద్ధి బాట పడుతున్నది. ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా లెక్కకు మించి పథకాలు అమలు చేస్తుండగా, వాటిని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నది. పల్లెపల్లెనా విద్య, వైద్యం, రవాణా సౌకర్యం మెరుగుపడుతున్నది. మాతా శిశు మరణాలను అరికట్టేందుకు 102 అమ్మ ఒడి, 108 అంబులెన్స్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన కేసీఆర్ కిట్లు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. పంటల సాగుకు రైతన్నలకు ప్రోత్సాహం అందుతుండగా, నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికాభివృద్ధి వైపు సాగుతున్నది. ఐదు వందల జనాభా కలిగిన గూడేలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయగా, అడవిబిడ్డల దశాబ్దాల కల సాకారమైంది. జోడెఘాట్లో రూ. 25 కోట్లతో స్మారక చిహ్నం, మ్యూజియాన్ని నిర్మించి, వారి ఖ్యాతిని ప్రపంచానికి తెలిసేలా చేసింది. హైదరాబాద్లో గిరిజనుల ఆత్మగౌరవ ప్రతీకలుగా ఆదివాసీ, బంజారా భవనాలు నిర్మించింది.
917 పాఠశాలలు.. 12,945 మంది విద్యార్థులు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 917 ఐటీడీఏ ప్రాథమిక పాఠశాలల్లో 12,945 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 113 ఆశ్రమ పాఠశాలల్లో 34658 మంది విద్యార్థులున్నారు. 912 మంది గిరిజన విద్యార్థులను బెస్ట్ అవైలేబుల్ ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వం చదివిస్తోంది. అంబేద్కర్ ఓవర్సిస్ విద్యానిధి పథకం ద్వారా రూ. 70 లక్షలతో ఏడుగురు విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యకు అవకాశం కల్పించింది. 73 పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా రూపకల్పన చేసింది. 3 ఆదర్శ క్రీడా పాఠశాలలు ప్రారంభించింది. 35 ఆశ్రమ పాఠశాలల్లో కంప్యూటర్ ట్యాబ్లు ఏర్పాటు చేసింది. అక్షర జ్యోతి కార్యక్రమం ద్వారా ప్రత్యేక విద్యా కార్యక్రమాలను చేపడుతోంది. అన్ని ప్రభుత్వ పాఠశాల్లో ఆంగ్ల బోధన ప్రారంభించింది.
గిరిపోషణ కార్యక్రమంతో..
ఐటీడీఏ గిరిపోషణ కార్యక్రమం ద్వారా 12371 మంది గర్భిణులు, బాలింతలు, 3 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలకు 6 రకాల ఆహార పదార్థాలను ఇక్రిషాట్, ఐసీడీఎస్ ద్వారా అందిస్తోంది. బాలామృతాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తోంది. చదువుతోపాటు గిరిజనుల ఆరోగ్యంపై దృష్టిసారించిన ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో 32 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 186 ఉపకేంద్రాలు, 6 సామాజిక ఆరోగ్య కేంద్రాల ద్వారా సేవలు అందిస్తోంది. ఉమ్మడి జిల్లాలో 1056 మలేరియా ప్రభావిత గిరిజన గ్రామాల్లో మలేరియా నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. కేసీఆర్ న్యూట్రిషియన్ కిట్లు, కేసీఆర్ కిట్లు, గిరిజనులకు ప్రత్యేకంగా అమలవుతున్నాయి. ఉట్నూర్, ఆసిఫాబాద్లలో డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాలలో డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసింది.
గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా..
గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పథకాలు అమలు చేస్తున్నది. గిరిజన పోరాటాల పురిటిగడ్డ జోడెఘాట్ను రూ. 25 కోట్లతో పర్యాటకంగా అభివృద్ధి చేసింది. గిరిజనుల సంక్షేమం, విద్య, వైద్యం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాలు కల్పించడంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. గిరి వికాసం పథకం ద్వారా రూ. 6 కోట్లతో ఆదివాసుల భూములకు సాగునీ రు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. వ్యవసాయం, నీటిపారుదల రంగాలతో పా టు యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు చేపట్టింది. జిల్లాలోని గిరిజనులకు వివిధ రంగాల్లో ఆర్థిక సహాయం అందించేందుకు ప్రణాళికలు అమలు చేస్తోంది. గిరిజన గ్రామాలకు రోడ్లు వేస్తున్నది. జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఐటీడీఏ భారీ స్థాయిలో నిధులను కేటాయించింది. ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు ప్రత్యేకంగా అమ్మఒడి, అవ్వాల్ అంబులెన్స్లను సమకూర్చింది. అటవీ భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు త్వరలో పోడు పట్టాలను ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆదివాసీ జంగుబాయి, లంబాడీల సేవాలాల్ పండుగలకు ప్రభుత్వం రూ.10లక్షల చొప్పున నిధులు అందజేస్తోంది. గిరిజన గ్రా మాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలతో వారి జీవన ప్రమాణాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఆచారా వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాల్లో తమ ఉనికిని కాపాడుకుంటూనే… సంక్షేమ పథకాలను పొందుతూ గిరిజనులు అభివృద్ధి బాట పడుతున్నారు.
అభివృద్ధి పనులు..