సారంగాపూర్, ఫిబ్రవరి 12: మండలంలోని శ్రీ మహా అడెల్లి పోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో సందడి మారింది. వేకువజాము నుంచే సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకున్నారు. పవిత్ర కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు. అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. భక్తులు కుశీపండగలు, పుట్టువెంట్రుకలు, తులాభారం, ఒడిబియ్యం సమర్పించారు. కొత్త వాహనాలకు పూజలు చేయించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, నిజామాబాద్ తదితర జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని నాందేడ్, వివిని, హిమాయత్నగర్, ఇస్లాపూర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. నిర్మల్, బైంసా ఆర్టీసీ డిపోల నుంచి అడెల్లి ఆలయానికి ప్రత్యేకంగా బస్సులు నడిపారు. ఎస్ఐ కృష్ణసాగర్రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
భైంసాటౌన్, ఫిబ్రవరి 17 : మండలంలోని ఇలేగాంలో ఊర పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు ఆలయాలకు వెళ్లి బోనాలు సమర్పించారు. డప్పు చప్పుళ్లు, బోనాలతో వందలాదిగా గ్రామస్తులు శోభాయాత్రగా వెళ్లా రు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామస్తులంతా కలిసి పండుగ జరుపుకున్నట్లు సర్పంచ్ ముత్యం తెలిపారు. గ్రామంలోని పోచమ్మ, మహాలక్ష్మీ, ఊరడమ్మ ఆలయాలకు వెళ్లి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.
ఖానాపూర్ రూరల్, ఫిబ్రవరి12: మండలం లోని గోసంపల్లి, రాజురాలో మహాలక్ష్మీ, ఎల్లమ్మ కు భక్తులు బోనాలు సర్పించారు. పలు కాలనీల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో నడింపల్లి ఎల్లమ్మ ఆలయం వరకు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. రాజురాలో 100 మంది మహిళలు శోభాయాత్ర గా గ్రామ శివారులోని మహాలక్ష్మీ ఆలయం వరకు వెళ్లి బోనాలు సమర్పించారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాల సర్పంచ్లు చిన్న లావణ్య, టేకు గంగారాం, మహిళలు పాల్గొన్నారు.
ముథోల్, ఫిబ్రవరి 12 : మండలంలోని తరోడాలో ఆదివారం బోనాల పండగను గ్రామస్తులు వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి పూజలు చేశారు.