నాగోబా ఉత్సవాల్లో భాగంగా బుధవారం మెస్రం వంశీయులు సంప్రదాయబద్ధంగా బేతాల్దేవతకు పూజలు నిర్వహించారు. మెస్రం వంశీయుల పీఠాధిపతి వెంకట్రావ్పటేల్ కాగడాలు వెలిగించి, బేతాల్ పూజలకు శ్రీకారం చుట్టారు. నేలపై తంబాకు వేసి నాగోబాకు మొక్కుకున్నారు. వాయిద్యాలు వాయిస్తూ మహిళలు, పురుషులు బేతాల్ నృత్యాలు చేశారు. నాగోబా పూజలతోపాటు సంప్రదాయ పూజలకు ముగింపు పలికారు. సాయంత్రం కేస్లాపూర్ నుంచి కుటుంబ సమేతంగా ఎడ్లబండ్లలో ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్ గ్రామంలో గల భుడుందేవు జాతరకు పయనం అవుతున్నట్లు మెస్రం వంశీయుల పెద్దలు తెలిపారు. కాగా.. వివిధ రాష్ర్టాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో కేస్లాపూర్ జనసంద్రంగా మారింది.
– ఇంద్రవెల్లి, జనవరి 25
ఆదివాసుల ఆరాధ్యదైవం నాగోబాను దర్శించుకునేందుకు జిల్లా నలుమూలలతో పాటు వివిధ రాష్ర్టాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయంతో పాటు జాతర పరిసరాలు కిక్కిరిశాయి. దర్శనం కోసం గంటల తరబడి బారులు తీరారు. అనంతరం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దారిపొడవునా వెలిసిన దుకాణాలు, హోటళ్ల వద్ద వివిధ రకాల వస్తువులు, తినుబండారాలు కొనుగోలు చేస్తూ ప్రజలు సందడి చేశారు. రంగులరా ట్నాలు, వెలిసిన హోటళ్లు, దుకాణాల్లో జనం రద్దీ కనిపించింది. ఎటుచూ సిన ప్రజలు జాతరకు తరలివస్తూ కనిపించారు.
– ఇంద్రవెల్లి, జనవరి 25
సంప్రదాయం ప్రకారం మండగాజిలింగ్ పూజలు
నాగోబా ఆలయ ఆవరణలో మెస్రం వంశీయుల ఆధ్వ ర్యంలో మండగాజిలింగ్ పూజలను సంప్రదాయం ప్రకా రం నిర్వహించారు. ముందుగా నాగోబాతోపాటు సతీదే వతలను దర్శించుకున్న భక్తులు వేసిన కానుకల (పావుడి డబ్బులు)లను పటేల్ కిత్త, కటోడ కిత్త, పర్ధాంజీ కిత్తల వారీగా పంచుకున్నారు. అనంతరం ప్రసాదంతోపాటు కొబ్బరికాయలు, ప్రమిదలు, మట్టికుండలు మెస్రం వంశీ యులతోపాటు వారి దగ్గరి బంధువులకు పంపిణీ చేశారు. మహాపూజలకు వాడిన మట్టికుండలను 22 కిత లకు చెందిన వారికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశీయుల పీఠాధిపతి వెంకట్రావ్పటేల్, చిన్నుపటేల్, బాజీరావ్, లింబారావ్పటేల్, కటోడ కోసు, కటోడ కోసేరావ్, కటోడ హనుమంత్రావ్, నాయిక్వాడి ధర్ము, పర్ధాంజీ మెస్రం దాదారావ్, నాగోబా పేన్ కొత్వాల్ తిరుపతి, మెస్రం వంశీయులు గణపతి, దేవ్రావ్, శేఖర్బాబు, రాము, గంగారాం పాల్గొన్నారు.
బేతాల్ దేవతకు మొక్కులు
నాగోబా ఆలయ ఆవరణలో మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో బేతాల్దేవతకు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సంప్రదాయం ప్రకారం మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్ కాగడాలను వెలిగించి, బేతాల్ పూ జలను ప్రారంభించారు. బేతాల్దేవత పేరిట సంప్రదాయ పద్ధతిలో నెలపై తంబాకు వేసి అక్కడి నుంచి నాగోబాను మొక్కుకున్నారు. అనంతరం వాయిద్యాలు వాయిస్తూ నృత్యాలు చేస్తూ గోవాడ్కు చేరుకున్నారు. గోవాడ్ పక్కన పటేల్ గాది ఏర్పాటు చేసి, బేతాల్దేవత పూజలపై మెస్రం వంశీయులతోపాటు మహిళలకు వేర్వేరుగా పర్ధాంజీ మెస్రం దాదారావ్, నాగోబా పేన్ కొత్వాల్ మెస్రం తిరుపతి వివరించారు.
గోవాడ్ ఎదుట మెస్రం వంశీయుల మహిళల ఆధ్వర్యంలో మెస్రం వెంకట్రావ్పటేల్ చేతి కర్రతోపాటు పెద్దల పాదాలను నీటితో కడిగారు. మహిళలు, మె స్రం వంశీయులు వేర్వేరుగా మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం వారి వాయిద్యాలు వా యిస్తూ మహిళలు, పురుషులు వేర్వేరుగా బేతాల్ నృత్యాలు చేశారు. తరువాత అక్కడి నుంచి నాగోబా ను దర్శించుకున్నారు. అనంతరం నాగోబా పూజలతోపాటు సంప్రదాయ పూజలకు ముగింపు పలికారు. సాయంత్రం కేస్లాపూర్ నుంచి కుటుంబ సమేతంగా ఎడ్లబండ్లలో ఉట్నూర్ మండలంలోని శ్యామ్పూర్ లోని భుడుందేవు జాతర కోసం బయల్దేరనున్నట్లు మెస్రం వంశీయుల పెద్దలు తెలిపారు. ఇక్కడ మెస్రం వంశీయుల పీఠాధిపతి వెంకట్రావ్పటేల్, చిన్నుపటేల్, బాజీరావ్పటేల్, లింబారావ్పటేల్, కటోడ కోసేరావ్, కోసు కటోడ, కటోడ హనుమంత్రావ్, నాయిక్వాడీ ధర్ము, పర్ధాంజీ మెస్రం దాదారావ్, నా గోబా పేన్ కొత్వాల్ తిరుపతి, గణపతి పాల్గొన్నారు.