నేరడిగొండ, మే 24 : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. బుద్దికొండ-వడూర్ రోడ్డు దాటుతుండగా.. శనివారం అర్ధరాత్రి అటుగా వెళ్తున్న వడూర్ యువకులు సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు పులి వెళ్తుండగా చూసిన యువకుడితో స్థలాన్ని పరిశీలించారు.
ఫొటోలో ఉన్న లోకేషన్తో పోల్చితే వాస్తవమేనని ప్రాథమికంగా నిర్ధారించారు. పెద్దపులి పాదముద్రలు కనిపిస్తే సమాచారం అందించాలని నేరడిగొండ ఎఫ్ఆర్వో గణేశ్ పేర్కొన్నారు. పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.