మిగ్జాం తుఫాన్ ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై పడింది. రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోగా.. మంచుతోపాటు చలిగాలులు వీస్తుండడంతో ప్రజలు వణుకుతున్నారు. 17 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా.. తుఫాన్ వల్ల చలితీవ్రత అధికంగా ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రహదారులపై వెళ్లే వాహనదారులు లైట్లు వేసుకొని వెళ్తున్నారు. వృద్ధులు, చిన్నారులు అతి జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలిగాలులు, ఇగం నుంచి ఉపశమనం పొందడానికి స్వెట్టర్లు, మంకీక్యాప్లు ధరించాలని. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని తెలుపుతున్నారు.
– ఆదిలాబాద్, డిసెంబర్ 5(నమస్తే తెలంగాణ)