ఖానాపూర్ టౌన్, జనవరి 11: గిరిజనుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, పర్యావరణ, అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరన్రెడ్డి అన్నారు. పట్టణ శివారులోని కుమ్రంభీం చౌరస్తాలో రూ. 1.10 కోట్లతో నిర్మించిన గిరిజన భవనాన్ని ఎమ్మెల్యేలు రేఖానాయక్, విఠల్రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి బుధవారం ప్రారంభించారు. ముందుగా మంత్రికి ఆదివాసీలు సంప్రదాయ పద్ధతిలో ఘనస్వాగతం పలికారు. అనంతరం భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. దండారీ ఉత్సవాల కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తున్నదని చెప్పారు. గూడేలను పంచాయతీలుగా చేసి అన్ని వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని గిరిజనులకు సంబంధించిన శుభకార్యాలు, సభలు, సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహించుకునేలా ఇక్కడ అన్ని హంగులతో గిరిజన భవనం నిర్మించినట్లు చెప్పారు.
రెండెకరాల విశాల ప్రదేశంలో ఆడిటోరియం ఏర్పాటు చేయడం హర్షనీయమని అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని వెల్లడించారు. గిరిజన భవనం బహుళ ప్రయోజనకరంగా ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే విఠల్రెడ్డి తెలిపారు. ఖానాపూర్లో అంబేద్కర్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని మంత్రిని కోరగా స్థలంతో పాటు రూ. 25 లక్షల మంజూరుకు హామీ ఇచ్చారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు విజయవంతం చేయాలని మంత్రి కోరారు. కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఆర్డీవో స్రవంతి, డీఏంహెచ్వో ధన్రాజ్, హెచ్ఈ జయలలిత, మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ ఖలీల్, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీశంకర్, వైస్ చైర్మన్ గంగాధర్, ఎంపీపీ మొయీద్, వైస్ ఎంపీ వాల్సింగ్, మండలం, పట్టణ అధ్యక్షులు రాజగంగన్న, సురేశ్, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, ఆదివాసీలు పాల్గొన్నారు.
ఆర్టీసీని ఆదరిస్తేనే ప్రయోజనం
ఆర్టీసీ ప్రయాణం అన్ని విధాలా సురక్షితమని, ప్రజలు ప్రయోజనం ఉంటుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ డిపోకు కొత్తగా వచ్చిన సూపర్ లగ్జరీ బస్సులను ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డితో కలిసి స్థానిక బస్టాండ్లో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రయాణికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ద్వారా అనేక ప్రయోజనాలను కల్పిస్తున్నదని చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ చిలుక రమణ, గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, డిపో మేనేజర్ ఎన్ సాయన్న, సహాయ మేనేజర్లు రాజశేఖర్, శ్రీకర్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, సంఘాల నాయకులు కేఎం.రెడ్డి, రాంచందర్రెడ్డి, నిర్వాహకుడు రమణ పాల్గొన్నారు.కళాశాలల అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ను మంత్రి అల్లోల విడుదల చేశారు. నిర్మల్ జిల్లాలో గత రెండుమూడేళ్లుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గంగాధర్, అధ్యాపకులు పాల్గొన్నారు. గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం జిల్లా శాఖ రూపొందించిన క్యాలెండర్, డైరీని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తన నివాస భవనంలో విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మహేందర్, ప్రధాన కార్యదర్శి ముత్యం, సంఘం బాధ్యులు సంధ్యారాణి, పద్మ, విజయ, నీరజ, జనార్దన్, ఫయీం, హరీశ్రెడ్డి, వెంకటేశ్వర్లు, గజ్జారాం, కిషన్రావు, సాయికృష్ణ పాల్గొన్నారు