మహిళా సంఘాలకు పావలా వడ్డీ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన మొత్తాన్ని ఎస్హెచ్జీల ఖాతాల్లో జమ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సెర్ప్, మెప్మా పరిధిలోని సంఘాలకు రెండేళ్లకు కలిపి సుమారు రూ. 60 కోట్లు వేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఈ కానుక అందించగా, పొదుపు సంఘాల్లోని సభ్యుల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది.
మంచిర్యాల అర్బన్/ ఆసిఫాబాద్, మార్చి 10 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పావలా వడ్డీ బకాయి చెల్లింపుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా రూ. 750 కోట్లు విడుదల చేశా రు. మహిళా సంఘాలకు వడ్డీ సొమ్మును ప్రభు త్వం అందజేయడంతో ఎస్హెచ్జీల సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ఎస్హెచ్జీల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేసింది.2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు గాను సెర్ప్, మెప్మా పరిధిలోని సంఘాలకు ఈ వడ్డీని ఖాతాల్లో జమచేసింది.
మహిళలకు ఆర్థిక ప్రయోజనం…
వాయిదాలతో పాటు నెలనెలా వడ్డీ సొమ్ము ను సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు సభ్యుల నుంచి సేకరించి నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇలా సకాలంలో వడ్డీ కట్టిన మహిళలకు ప్రభుత్వం పావలా వడ్డీ పథకాన్ని వర్తింపజేస్తోంది. దీని ద్వారా మహిళలు చెల్లించి న వడ్డీ సొమ్మును గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా తిరిగి అందజేస్తున్నారు. ప్రస్తుతం 2019, నవం బర్ వరకు రావాల్సిన వడ్డీ బకాయిలను చెల్లిం చారు. రెండేళ్ల వడ్డీ బకాయిలు విడుదల చేయ డంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల జిల్లాలో సెర్ప్ ఆధ్వర్యంలోని 8459 సంఘాలకు రూ. 12.62 కోట్లు విడుదల చేయగా, మెప్మా ఆధ్వర్యంలోని 8413 సంఘాలకు రూ. 11.69 కోట్లు జమ చేసింది. మొత్తంగా జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు, 16 మండలాల్లోని 16,872 మహిళా సంఘాల ఖాతాల్లో రూ. 24.32 కోట్లు జమయ్యాయి.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ జిల్లాలోని 18 మండలాల పరిధిలో సెర్ప్ పరిధిలో ఉన్న సుమారు 7332 సంఘా లకు రూ. 13.18 కోట్లు జమ చేసింది. మెప్మా పరిధిలోని 2339 సంఘాలకు రెండేళ్లకు కలిపి సుమారు రూ. 5.16కోట్లు అందించనున్నారు.
ఆదిలాబాద్ జిల్లా పరిధిలో
ఆదిలాబాద్ జిల్లాలో సెర్ప్ పరిధిలోని 6959 రూ.4.71 కోట్లు, మెప్మా పరిధిలో 920 సంఘాలకు సుమారు రూ. 5. 20కోట్లు జమ చేసింది. మొత్తంగా సుమారు రూ. 9.90 కోట్లు మహిళా సంఘాల వడ్డీ చెల్లించింది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 15 మండ లాల పరిధిలో 5173 స్వయం సహాయక సంఘా లకు రూ. 3.65కోట్లు, మెప్మా పరిధిలో 911 సంఘాలకు రూ. 3.89కోట్లు జమ చేసింది. మొత్తంగా సుమారు రూ. 7 కోట్లు వడ్డీ విడుదల చేసింది.
హమీని నిలబెట్టుకున్న సర్కారు..
మహిళా దినోత్సవం రోజు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నది. మాకు రావాల్సిన వడ్డీ డబ్బులను మా పొదుపు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయడం ఆనందంగా ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్ సర్కారుకు రుణపడి ఉంటాం. రెండేండ్ల వడ్డీని ప్రభుత్వ ఇచ్చింది.
– ఎముల రాణి, స్వయం సహాయ సంఘం సభ్యురాలు
తెలంగాణ రావడం వల్లనే..
తెలంగాణ రాష్ట్రం రావడం వల్లే సీఎం కేసీఆర్ సార్ ఆడోల్ల కోసం అనేక పథకాలు తీసుకచ్చిండు. మాకు రెండేండ్ల వడ్డీ డబ్బులను సర్కారు మా పొదుపు ఖాతాల్లో జమ చేసింది. ఇందుకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడమే కారణం. చాలా ఆనందంగా ఉంది. కేసీఆర్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– పోల లక్ష్మి, స్వయం సహాయ సంఘం సభ్యురాలు, బన్సపల్లీ