హాజీపూర్, మే 23 : జిల్లా కేంద్రంలోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాన్ని రిజిస్ట్రేషన్-స్టాంపుల కరీంనగర్ రేంజ్ డీఐజీ రవీందర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులు, రిజిష్టర్లను పరిశీలించారు. భూముల క్రయ, విక్రయాలకు చెందిన రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలించారు.
రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్, మార్కెట్ విలువ పెంచబోతుందనే ప్రచారం జరుగుతుందని, పెరిగితే ఇప్పుడున్న విలువ పై ఎంత శాతం పెరుగుతుందని ‘నమస్తే తెలంగాణ’ ప్రశ్నించగా, ప్రస్తుతం ప్రభుత్వం నుంచి భూముల రిజిస్ట్రేషన్, మార్కెట్ విలువ పెంపుపై ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు.