నిర్మల్ టౌన్, డిసెంబర్ 1 : నిర్మల్ జిల్లాలో అక్రమ లే అవుట్లను క్షేత్రస్థాయిలో గుర్తించి చర్య లు తీసుకోవాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూ ఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో అక్రమ లేఅవుట్లపై రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అన్ని ప్రాంతాల్లో అధికారులు గ్రామాలను సందర్శించి అక్రమ లేఅవుట్లను గుర్తించాలని, అందులోని బోర్డులను తొలగించాలని సూచించారు. ని బంధనలు పాటించని లేఅవుట్లపై చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ ప్రకారం నిబంధనలు పాటించని వెంచర్ల వివరాలను వెంటనే అందించాలని కోరారు. జిల్లాలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరోగ్య, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ దవాఖానలో సాధారణ కాన్పులకు ప్రోత్సాహం, తదితర అంశాలపై జిల్లా వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, రాంబాబు, ఇన్చార్జి డీఆర్వో లోకేశ్, ఆర్డీవో స్రవంతి, రవికుమార్, తహసీల్దార్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి ఇంటికీ శుద్ధజలం అందించేందుకు అమలు చేసిన మిషన్ భగీరథ పథకం పనులు పూర్తి చేయాలని, నీరందేలా తక్షణం చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మిషన్ భగీరథ పనులపై గురువారం స్థానిక ఎంపీడీవోలు, ఎంపీవోలతో సమావేశం నిర్వహించారు. ఆయా మండలాల్లో మిషన్ భగీరథ కింద నీరు సరఫరా అయ్యే గ్రామాలను సందర్శించి పెండింగ్ పనులను గుర్తించాలని చెప్పారు. తాత్కాలిక లీకేజీలను అరికట్టాలని సూచించారు. ఎత్తయిన ప్రదేశాలకు నీరు వెళ్లకుంటే వాటిని గుర్తించి నివేదిక అందించాలన్నారు. పనుల పెండింగ్, నిర్వహణపై రోజువారీ సమాచారాన్ని అందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, తదితర అధికారులున్నారు.