సీసీసీ నస్పూర్, జనవరి 3: నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యం చేరేందుకు ప్రతి ఉద్యోగి కష్టపడి పనిచేయాలని శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి సూచించారు. ఏరియాలోని ఆర్కే 7, ఆర్కే న్యూటెక్, ఏరియా వర్క్షాప్, ఏరియా స్టోర్లను మంగళవారం సందర్శించారు. ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తె లిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే మూడు నెలలు కీలకమని, రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించడానికి కృషి చేయాలని కోరారు.
సంస్థలో చేరే కొత్త ఉద్యోగులకు మంచి అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏజెంట్ సత్యనారాయణ, వర్క్షాప్ డీజీఎం చంద్రశేఖర్రెడ్డి, సోమశేఖర్, ఆర్కే 7, ఆర్కే న్యూటెక్ గని మేనేజర్లు సాయిప్రసాద్, స్వామిరాజు, వర్క్షాప్ ఎస్ఈ సతీశ్ చక్రవర్తి, సెక్యూరిటీ అధికారి మురళీమోహన్, టింబర్యార్డు ఇన్చార్జి జక్కారెడ్డి, రక్షణాధికారులు రవిశంకర్, కొట్టె రమేశ్, టీబీజీకేఎస్ ప్రతినిధులు బుస్స రమేశ్, మెండె వెంక టి, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.