ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా కొనసాగింది. రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య పెండ్లితంతు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షామీయాలలో కూర్చొని భక్తులు వేడుకను తిలకించారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. హనుమాన్ భక్తులు, యూత్ మండలి సభ్యులు శ్రీరాముని ప్రతిమలు, జెండాలు పట్టుకుని పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. పల్లకీ సేవ నిర్వహించారు. హనుమాన్ దీక్షాదారులు కూడా శోభాయాత్రయలో పాల్గొన్నారు. స్వచ్ఛంద సేవా సంస్ధల ఆధ్వర్యంలో పులిహోర, ప్రసాదం, అంబలి, మంచినీరు, జ్యూస్లను భక్తులకు ఉచితంగా అందించారు. పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కల్యాణ మహోత్సవానంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, బెల్లం పాణకం, వడపప్పు వితరణ చేశారు. – నెట్వర్క్