కాసిపేట : వేసవి సెలవుల సందర్భంగా ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని( Aadhaar Center ) సద్వినియోగం చేసుకోవాలని ఎంఈవో వెంకటేశ్వర స్వామి ( MEO Venkateshwara Swamy) సూచించారు. సోమవారం కాసిపేట విద్యా వనరుల కేంద్రంలో ప్రత్యేక ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలో కొత్త ఆధార్ నమోదు, ఆధార్ వివరాలలో మార్పులు, చేర్పులు చేపడుతారని వివరించారు.
18 సంవత్సరాల లోపు పిల్లలకు కొత్తగా ఆధార్ నమోదు, పాఠశాలలో పేరు నమోదు ఉన్న విద్యార్థులు బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకునేందుకు ఎలాంటి రుసుము అవసరం లేదని పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, అవసరమైన ఆధార్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీసీవో రాంబాబు, ఎంఐఎస్ కోఆర్డినేటర్ సౌజన్య పాల్గొన్నారు.