బోథ్, ఏప్రిల్ 8 : పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు గ్రామాలు తిరుగుతూ ప్రజలతో సత్సంబంధాలు ఏర్పర్చుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్కుమార్రెడ్డి సూచించారు. బోథ్లోని పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని శనివారం తనిఖీ చేశారు. రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. క్రైం వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నమోదు, ఇతర అంశాలపై సంతృప్తి వ్యక్తం చేశా రు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసులు గ్రా మాలు తిరగడం మూలంగా క్రైం వివరాలు, ఇత ర సమాచారం వెంటనే తెలిసే వీలుంటుందని పే ర్కొన్నారు. సమాచారం ఎప్పుడు వచ్చినా స్పం దించాలని సూచించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. గతంలో కంటే క్రైం రేటు తగ్గిందన్నారు. జిల్లాలో అన్ని వైపులా మహారాష్ట్ర సరిహద్దు ఉన్నందున బార్డర్లో నిఘా పెంచామ ని తెలిపారు. దాబాల్లో మందు విక్రయాలు, సిట్టింగ్ బంద్ చేయించామన్నా రు.
పేకాట, మట్కా, గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని పేర్కొన్నారు. నైట్ పెట్రోలింగ్ ము మ్మరం చేశామన్నారు. యూపీ, బిహార్ తదితర ప్రాంతాల నుంచి కొంత మంది లారీ కంటెయినర్లలో వస్తూ జాతీయ రహదారిపై లారీల హైజాకింగ్కు పాల్పడుతున్నారని చెప్పారు. గ్రామాల్లో గంజాయి విక్రయాలు, సేవించడం వంటివి చేస్తే సమాచారం అందించాలన్నారు. ఉట్నూర్ ప్రాం తంలో పోలీసుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమా లు చేపడుతున్నామని తెలిపారు. కళాజాత బృం దాలతో ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ వీ ఉమెందర్, బోథ్ సీఐ కిరణ్కుమార్, బోథ్, బజార్హత్నూర్ ఎస్ఐలు కేంద్రే రవీందర్, సయ్యద్ ముజాహిద్, సిబ్బంది పాల్గొన్నారు.