ఎదులాపురం, డిసెంబర్ 2: కౌంటింగ్ హాల్ పరిసర ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉం టుందని కౌంటింగ్ పాస్ ఉన్నవారికి మాత్రమే సెంటర్లోకి అనుమతి ఉందని జిల్లా ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఎన్నికల లెక్కంపు ప్రక్రియలో భాగం గా ఆదిలాబాద్ పట్టణంలోని స్థానిక టీటీడీసీ ప్రాంగణంలో ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. లెక్కిం పు ప్రక్రియ పూర్తి సజావుగా కొనసాగేందుకు జి ల్లా పోలీస్ యంత్రాంగం అన్ని విధాలుగా ఏర్పాట్లను పూర్తిచేయడం జరిగిందన్నారు.
కౌంటింగ్ ప్రాంగణం ఒక కిలోమీటర్ చుట్టుపక్కల ప్రాం తం అంతా 144 సెక్షన్ కొనసాగుతుందన్నారు. అలాగే కౌంటింగ్ పూర్తయ్యే వరకు జిల్లా వ్యా ప్తంగా మద్యం షాపులు, బెల్ట్షాపులు నిర్వహించరాదన్నారు. కౌంటింగ్ హాల్ అనుమతి ఉన్నవారికి మాత్రమే కౌంటింగ్ హాల్ పరిసరాలకు రావాలన్నారు. కౌంటింగ్ హాల్ పాసులు ఉన్న ఏజెంట్లు సెల్ఫోన్లు, అగ్గి డబ్బా, ఇంకు బాటిల్, లాంటి వాటిని తీసుకెళ్లేందుకు అనుమతి లేదన్నారు. అటు వైపు ఉన్న కేఆర్కే కాలనీ వాసుల కు స్థానిక మావల పోలీస్ స్టేషన్ మీదుగా తిరుమల పెట్రోల్ బంక్ ముందు రోడ్డును వినియోగించుకోవాలని పేర్కొన్నారు.
కౌంటింగ్ అయిన తరువాత 24 గంటల వరకు ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు, పటాకులకు అనుమతి లేదన్నారు. ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు గుమిగూడి ఉండడానికి అనుమతి లేదన్నారు. కౌంటింగ్ హాల్లో మూడంచెల భద్రతను ఏర్పాటు చేసి, పరిసర ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు సజావుగా ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు.
స్థానిక టీటీడీసీ కేంద్రంలో ఆదివారం నిర్వహించనున్న అదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల అ సెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు అన్ని ఏర్పాటు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ రాహు ల్ రాజ్ అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక టీటీడీసీ కేంద్రాన్ని సందర్శించి అధికారులకులు పలుసూచనలు చేశారు. ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంలు లేకుండా చూడాలన్నారు.