ఆసిఫాబాద్, జనవరి 19 : మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్ పనితీరు భేష్ అని ఎస్పీ కే సురేశ్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో షీ టీమ్ బృందం సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పా టు చేశారు. మహిళలు, విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలపై చర్యలు తీసుకోవాలని, ఈవ్టీజర్ల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వడం, మళ్లీ పట్టుబడితే కేసు నమోదుచేయడం షీటీమ్స్ ముఖ్య బా ధ్యతలని గుర్తు చేశారు.
జిల్లాలో మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టి కేసులు తగ్గే లా చూడాలని ఆదేశించారు. సైబర్ క్రైమ్లు పెరుగుతున్న నేపథ్యంలో యువతకు, విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో టాస్ ఫోర్స్, స్పెష ల్ బ్రాంచ్ సీఐ రాణా ప్రతాప్, కాగజ్నగర్, ఆసిఫాబాద్ డివిజన్ షీ టీమ్ ఇన్చార్జులు శ్రీనివాస్, సునీత, సభ్యులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్, జనవరి19 : పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ సురేశ్కుమార్ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందిన వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదోన్నతి పొందిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి పారదర్శకంగా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి ఒకరూ నిజాయితీతో పనిచేసి పోలీస్శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
ఒత్తిడి తట్టుకోవడానికి యోగా, ధ్యానం చేయాలని సూచించా రు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అచ్చేశ్వర రావు, ఏవో శ్రీనివాస్, టాస్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ సీఐ రాణా ప్రతాప్, రిజర్వుడ్ ఇన్స్పెక్టర్ (అడ్మిన్) పెద్దన్న, ఏఎస్ఐలుగా పదోన్నతి పొందిన రమేశ్, అనిల్కుమార్, చంద్రశేఖర్, సాయిబాబా, వేణుగోపాల్, హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన ముక్తర్ బేగ్, గణేశకుమార్, పోచయ్య, దత్త, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్, జనవరి19 : వన్యప్రాణుల కోసం పంటపొలాలు, అటవీప్రాంతాల్లో విద్యుత్ తీగలు అమర్చితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సురేశ్కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ తీగలు అమర్చడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇటీవల సిర్పూర్ మండలం చాప్రి గ్రామ సమీపంలో కొందరు అటవీ జంతువుల కోసం కరెంట్ వైర్ పెట్టడంతో ఓ వ్యక్తి చనిపోయాడని తెలిపారు.