శ్రీరాంపూర్, డిసెంబర్ 20: బొగ్గు ఉత్పత్తి, రవాణా, నాణ్యతా ప్రమాణాలపై అన్ని ఏరియాల జీఎంలతో సింగరేణి డైరెక్టర్లు ఎన్వీకే శ్రీనివాస్, వెంకటేశ్వర్రెడ్డి బుధవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. శ్రీరాంపూర్ ఏరియా నుంచి జీఎం సంజీవరెడ్డి, పీవోలు ఎం శ్రీనివాస్, పురుషోత్తంరెడ్డి పాల్గొని మాట్లాడారు.
బొగ్గు ఉత్పత్తి, రవాణాకు తీసుకోవాల్సిన చర్యలపై డైరెక్టర్లు పలు సూచనలు చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాల సాధనకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీవైజీఎం చిరంజీవులు, క్వాలిటీ మేనేజర్ వెంకటేశ్వర్రెడ్డి, సీనియర్ ఐటీ ప్రోగ్రామర్ శ్రీనివాస్ పాల్గొన్నారు