కోటపల్లి, జనవరి 5 : కోటపల్లి మం డలం సూపాకలో ఆదివారం మారెమ్మ, లక్ష్మీదేవి బోనాలు నిర్వహించనున్నట్లు సర్పంచ్ కాశెట్టి సతీశ్, ఉప సర్పంచ్ గట్టు వెంకటమ్మ తెలిపారు.
బోనాల సందర్భంగా అమ్మవార్లకు శుక్రవారం ప్రాణహిత నదిలో అభిషేకాలు నిర్వహించారు. శనివారం రాగి బోనం, ఆదివారం బోనాల సమర్పణ కార్యక్రమం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావాలని కోరారు.