ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి (Indravelli ) మండల కేంద్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల ( Smart Ration Cards ) ను ఇంద్రవెల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ రాథోడ్ మోహన్ సింగ్, ఏఎంసీ చైర్మన్ ముకాడే ఉత్తమ్ లబ్ధిదారులకు పంపిణి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
లబ్ధిదారుల పూర్తి వివరాలతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డును ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండీ జహీర్, పట్టణ అధ్యక్షులు జితేందర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కాంబ్లె బాబా రావ్, నాయకులు మీర్జా యాకుబ్ బేగ్, కిషోర్ సోమసే, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.