జన్నారం, డిసెంబర్ 17: కవ్వాల్ టైగర్ రిజర్వుడు ఫారెస్ట్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందితే పెద్దపులి దానంతట అదే వస్తుందని మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాకు చెందిన అటవీ సంరక్షణ అధికారి(వైల్డ్లైప్ వార్డెన్)రంజాన్ విరాణి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని అటవీశాఖ కమ్యూనిటీ హాల్లో నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాకు చెందిన అటవీ శాఖ రేంజ్ అధికారులు, డీఆర్వో, సెక్షన్, బీట్ అధికారులు, బేస్ క్యాంప్ సిబ్బందికి ఆదివారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు.
పర్యాటక రంగం అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా గైడ్స్ను నియమించడంతో పాటుగా అడవుల్లో నివసించే వారితో సత్సంబంధాలను కలిగి ఉండాలని సూచించారు. పర్యాటకుల కోసం ప్రత్యేకమైన రోడ్లు వేయకుండా, ఆయా గ్రామాల నుంచి వారు వెళ్లేలా చూస్తే అడవుల్లో నివసించేవారికి కొంత ఉపాధి లభిస్తుందని తెలిపారు. వన్యప్రాణుల వలన నష్టపోయిన వారందరికీ నష్టపరిహారం అందించాలన్నారు. ఈ కార్యక్రమం లో రేంజ్ ఆఫీసర్లు హఫీసొద్దీన్, రవి, గూల్బా మోయినోద్దీన్, ఎక్బాల్, శంకర్, రామకృష్ణ, జీ చంద్రశేఖర్, వైల్డ్ లైఫ్ బయోలా జికలిస్ట్ జే ఎల్లాం, డీఆర్వోలు, సెక్షన్, బీట్ ఆఫీసర్లు, బేస్క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.