ఎదులాపురం,మార్చి 19: ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్న దని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అ న్నారు. జిల్లా కేంద్రంలోని రాణి సతీజీ కాలనీలో రూ.23లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆదివారం ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ప్రజలు వ్యాయామం చేసుకునేందుకు వీలుగా ఈ ఓపెన్ జిమ్ను ఏర్పాటు చేయించినట్లు చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధి కోసం తిరగాలంటే చెప్పులు అరిగేవని, రాష్ట్ర ప్రభుత్వం వ చ్చాక ప్రజా సంరక్షణతోపాటు పట్టణ అభివృద్ధికి రూ. వేల కోట్లతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రే మేందర్, స్థానిక కౌన్సిలర్ సోమరవి స్వప్న, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అలాల అజయ్, ఫ్లోర్ లీడర్ బండారి సతీశ్, బీఆర్ఎస్ పార్టీ బీసీ పట్ట ణాధ్యక్షుడు దాసరి రమేశ్, మహిళా నాయకురా లు బీ అనసూయ, తదితరులున్నారు.
ఆరోగ్య సంరణకే..
ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేస్తున్నట్లు ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. బేల మండల కేంద్రంలో రూ.1.56 కోట్లతో నిర్మించనున్న 30 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మండల నాయకులతో కలిసి ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా స్థానికులు ఎదురుచూస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొత్త భవన నిర్మాణానికి ని ధులు కేటాయించి పనులు ప్రారంభించామని తెలిపారు. స్వరాష్ట్రంలోనే అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని స్పష్టం చేశారు. మండలంలో నెలకొన్న సమస్యలన్నీ దశల వారీ గా పరిష్కరిస్తున్నామని తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, ఎంపీపీ వనితా ఠాక్రే, బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గం భీర్ ఠాక్రే, బేల సర్పంచ్ వట్టిపెళ్లి ఇంద్రశేఖర్, డీఅండ్హెచ్వో నరేందర్ రాథోడ్, బేల పీహెచ్సీ వైద్యుడు వంశీకృష్ణ, బీఆర్ఎస్ నాయకులు ప్రమోద్ రెడ్డి , దేవన్న, జక్కుల మధుకర్, మస్కేతేజ్రావు, తన్వీర్ఖాన్, బండి సుదర్శన్, మం గేష్ ఠాక్రే, కిషన్వైద్య, విపిన్ఖోడే, గ్రామాల సర్పంచ్లు, నాయకులు తదితరులున్నారు.