కాసిపేట, మార్చి 4 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెం గ్రామ పంచాయతీలోని చొప్పరపల్లిలోగల అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేయడపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బుధవారం అంగన్వాడీ కేంద్రం ద్వారా లబ్ధిదారులకు కోడిగుడ్లు పంపిణీ చేశారు. వంట చేసే క్రమంలో వాటిని చూడగా మొత్తం కుళ్లిపోయి ఉన్నాయి. నాసిరకం కోడిగుడ్లు సరఫరా చేయడంపై మండిపడ్డారు. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.