ఎదులాపురం, జనవరి 25 : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని డీఆర్డీవో కిషన్ పేర్కొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని డీఆర్డీఏ కార్యాలయంలో అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్లలో చైతన్యం తెచ్చేందుకు 2011 జనవరి 25 నుంచి జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీఆర్డీవో రాథోడ్ రవీందర్, ఏవో లక్ష్మీకాంత్, సూపరింటెండెంట్ జయసింహ, అరుణ్రావు, వర్ష, తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, జనవరి 25 : ప్రజాస్వామ్య విలువలు పెంపొందించుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ప్రణీత పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని గెజిటెడ్ ఉన్నత పాఠశాల నంబర్ -1, బాలికల ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఓటు హక్కు ప్రాధాన్యం గురించి వివరించారు. కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ అధికారులు సూరజ్రావ్, మహేందర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు నీలాదేవి, ఉపాధ్యాయులు నంద, మీనాక్షి, సంధ్యారాణి, నవీన, సంధ్య, యాదగిరి, ప్రశాంత్, యూసుఫ్, గౌస్, ఆరిఫ్, సంతోష్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఓటు హక్కు వజ్రాయుధం
బేల, జనవరి 25 : ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తహసీల్దార్ బడాల రాంరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో సిబ్బందితో కలిసి ఓటు హక్కుపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ వామన్, ఆర్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
భీంపూర్, తాంసిలో..
భీంపూర్, జనవరి 25 : భీంపూర్, తాంసిలోని తహసీల్, మండల పరిషత్ కార్యాలయాల్లో అధికారులు ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తు చేసేలా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో భీంపూర్ తహసీల్దార్ సోము, ఎంపీవో వినోద్, తాంసి ఎంపీడీవో ఆకుల భూమయ్య, సూపరింటెండెంట్ రవీందర్, డీటీలు విష్ణు, హరిదాస్ , ఆర్ఐలు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరికీ ఓటు తప్పనిసరి
నార్నూర్, జనవరి 25 : 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటరుగా గుర్తింపు ఉండాలని తహసీల్దార్ దుర్వా లక్ష్మణ్ పేర్కొన్నారు. తహసీల్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ అమృత్లాల్, ఆర్ఐలు, రెవెన్యూ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించి ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్ఐలు కవిత, బీర్శావ్, వీఆర్వోలు, వీఆర్ఏలు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, జనవరి 25 : మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ రాఘవేంద్రరావ్, రెవెన్యూ శాఖ అధికారులు ఓటు హక్కు వినియోగం, ఓటరు నమోదుపైప్రతిజ్ఞ చేశారు. గ్రామాల్లో ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
నేరడిగొండ, జనవరి 25 : మండలంలోని కుమారి గ్రామంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. నూతన ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజుయాదవ్ బీఎల్వోలు పాల్గొన్నారు.
ఓటు హక్కు కలిగి ఉండాలి
సిరికొండ, జనవరి 25 : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని తహసీల్దార్ సర్ఫరాజ్ అన్నారు. మండలంలోని రిమ్మ, సొంపల్లి, లక్ష్మీపూర్ గ్రామాల్లో ప్రజలకు ఓటుహక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. అనంతరం వారితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శంకర్ నాయక్, ఆర్ఐ యుజ్వేందర్ రెడ్డి, సిబ్బంది, సర్పంచ్లు పాల్గొన్నారు.
ఓటు ప్రాముఖ్యతపై అవగాహన
బోథ్, జనవరి 25: మండల కేంద్రంలోని ప్రగతి పాఠశాలలో ప్యుపిల్స్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అనంతరం ప్లకార్డులు ప్రదర్శించారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు సంతోష్, రోహిత్, సాయికృష్ణ, రవితేజ పాల్గొన్నారు.
బజార్హత్నూర్, జనవరి 25: మండల కేంద్రంలో తహసీల్దార్ గంగాధర్ ఆధ్వర్యంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. యువకులతో ర్యాలీ తీయించారు. ఓటు హక్కు గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం తహసీల్ కార్యాలయ ఆవరణలో ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, బీఎల్వోలు పాల్గొన్నారు.