తాండూర్ : గ్రంథాలయ పార్ట్ టైం స్వీపర్స్ ( Library Part time sweepers ) ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్లో రాష్ట్ర గ్రంథాలయ డైరెక్టర్ శ్రీహరిని ( Director Srihari ) కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డైరెక్టర్ తమ సమస్యలను సానుకూలంగా విని త్వరలోనే రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ తో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పార్ట్ టైం స్వీపర్స్ రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్, ప్రధాన కార్యదర్శి కాస్తాల మధు, కోశాధికారి ఖమ్మంపాటి మధుసూదన్, సహాయ కార్యదర్శులు సయ్యద్ సలీం, చెరుకుపల్లి స్వామి, కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల పార్ట్ టైం స్వీపర్స్ పాల్గొన్నారు.