కరోనా వైరస్పై ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం
లక్షలాది మందికి పునర్జన్మనిచ్చిన డాక్టర్లు
నేడు జాతీయ వైద్యుల దినోత్సవం
మంచిర్యాల, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : వైద్యో నారాయణ హరి.. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం. తల్లిదండ్రులు జన్మనిస్తే వారు పునర్జన్మనిస్తారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్పై వారు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాటం చేస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో ఫ్రంట్లైన్ వారియర్స్గా సేవలందించి లక్షలాది మందిని కాపాడారు. నేడు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
జూలై 1న అంతర్జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటారు. డాక్టర్స్ డే మొదట 1991లో నిర్వహించారు. అప్పటి నుంచి యేటా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్ రెండో ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రసిద్ధ వైద్యుడు డాక్టర్ బిధన్ చంద్రరాయ్కు గౌరవం ఇచ్చేందుకు ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జూలై 1న జరుపుకుంటారు. ఆయన 1 జూలై, 1882న జన్మించి, 1 జూలై 1962న మరణించారు. బీసీ రాయ్ వైద్య రంగంలో అనేక సంస్కరణలు చేపట్టి 1943లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. వైద్యుల లక్షణం, నిబద్ధత, త్యాగనిరతి అనే పదాలకు ఆయన నిలువెత్తు నిదర్శనం. ప్రభుత్వం ఆయన అందించిన సేవలకు గుర్తుగా భారతరత్న ఇచ్చింది. వైద్యుల దినోత్సవాన్ని దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో వేర్వేరు తేదీల్లో జరుపుకుంటారు. వైద్యులకు గ్రీటింగ్ కార్డులు పంపడం, చనిపోయిన వైద్యుల సమాధులపై పూలు ఉంచుతారు. కొవిడ్ మహమ్మారి సమయమంలో వైద్యులు, నర్సులు ఫ్రంట్లైన్ వారియర్స్గా పోరాటం చేశారు. లక్షలాది మందిని తమ వైద్యంతో కాపాడారు. ఇక కొందరు వైద్యులు తమ ప్రాణాలను సైతం పోగొట్టుకున్నారు.
డాక్టర్స్ డే చరిత్ర..
మొదటి వైద్యుల దినోత్సవం మార్చి 28, 1933లో జార్జియాలోని విండర్లో నిర్వహించారు. ఈ మొదటి ఆచారంలో వైద్యులు, వారి భార్యలకు కార్డులు పంపడం, డాక్టర్లాంగ్తో సహా మరణించిన వైద్యుల సమాధులపై పుష్పాలు ఉంచడం, డాక్టర్ అండ్ శ్రీమతి విలియం టీ.రాండోల్స్ ఇంట్లో అధికారిక విందు వంటివి ఉన్నాయి. బారో కౌంటి అలయన్స్ వైద్యులకు నివాళి అర్పించేందుకు శ్రీమతి ఆల్మండ్ తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత, ఈ ప్రణాళికను 1933లో బారో కౌంటీ అలయన్స్ అధ్యక్షురాలు విండర్కు చెందిన శ్రీమతి ఈఆర్ హారిస్ జార్జియా స్టేట్ మెడికల్ అలయన్స్కు సమర్పించారు. మే 10, 1934న జార్జియాలోని అగస్థాలో జరిగిన వార్షిక రాష్ట్ర సమావేశంలో తీర్మానం ఆమోదించారు. సెయింట్ లూయిస్, మిస్సోరి, నవంబర్ 19-22, 1935లో జరిగిన 29వ వార్షిక సమావేశంలో సదరన్ మెడికల్ అసోసియేషన్ ఉమెన్స్ అలయన్స్కు ఈ తీర్మానాన్ని అలయన్స్ ప్రెసిడెంట్ శ్రీమతి జే.బోనార్ వైట్ ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి, వైద్యుల దినోత్సవం సదరన్ మెడికల్ అసోసియేషన్ అలయన్స్లో అంతర్భాగంగా, పర్యాయపదంగా మారింది.
0.4 జీసీఏ కలిపేది వీరికే..
ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పాస్ అయిన విద్యార్థులకు, నాన్రెషిడెన్షియల్ పాఠశాలల, జడ్పీ హైస్కూల్, మున్సిపల్ హైస్కూల్, సాంఘిక సంక్షేమ మోడల్ స్కూల్లో చదివిన విద్యార్థులకు 0.4 జీపీఏ వెయిటేజీ ఇవ్వనున్నారు. ట్రిపుల్ఐటీలో 85 శాతం సీట్లను స్థానికంగా, మిగిలిన 15 శాతం సీట్లను మెరిట్ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు కేటాయించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు 371 ఆర్టికల్ డీ సెక్సన్ 95, 2014 మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.