మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 20 : జిల్లా కేంద్రంలోని సైన్స్ సెంటర్లో ఫోరం ఆఫ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ (ఎఫ్పీఎస్టీ), బయోలాజికల్ సైన్స్ టీచర్స్ ఫోరమ్ (టీబీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో మంగళవారం ఆన్లైన్ విధానంలో జిల్లా స్థాయి సైన్స్ టాలెంట్ టెస్టు నిర్వహించారు.
ముఖ్య అతిథిగా క్వాలిటీ కో ఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి, జిల్లా సైన్స్ అధికారి మధుబాబు హాజరై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. పత్రి విద్యార్థి అబ్దుల్ కలాం, సీవీ రామన్ జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంలు రామన్న, బయోలాజికల్ సైన్స్ ఉపాధ్యాయ ఫోరం ఉపాధ్యాయులు వనమాల పద్మ, సంగర్స్ వెంకటేశ్వర రావు, ఎఫ్పీఎస్టీ బాధ్యులు శ్రీమూర్తి, విద్యాసాగర్, రాజేశం పాల్గొన్నారు.
విజేతలు వీరే…
జిల్లా స్థాయి పోటీల్లో పీ సుశాంత్ (బెల్లంపల్లి, జడ్పీహెచ్ఎస్ బజారు ఏరియా) ప్రథమ స్థానం, ఎస్ అశ్వక్ (జడ్పీహెచ్ఎస్ కలమడుగు – జన్నారం) ద్వితీయ స్థానం, ఎస్ జశ్వాంత్ ( జడ్పీహెచ్ఎస్ అచ్చులాపూర్) తృతీయ స్థానంలో నిలిచారు. వీరు రాష్ట్రస్థాయి టాలెంట్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.