ఆసిఫాబాద్ : గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం అసెంబ్లీ వర్షాకాల సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే నియోజకవర్గంలోని పలు సమస్యలను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. పాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన చిన్న పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులతో పాటు కార్మికులు కష్టపడుతున్నారని వారికి సంబంధించిన అర్థిక పరమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు.
దీంతో మల్టిపర్పస్ వర్కర్లను అదనంగా కేటాయించాలని కోరారు. పరిశుభ్రమైన పంచాయతీలతో ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు.ఇందు కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని సంబంధిత మంత్రిని కోరారు.