మామడ, సెప్టెంబర్ 19 : మండలంలోని పొన్కల్ గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును ఆ మండల నాయకులు కోరారు. ఈ మేరకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా చుట్టూ పక్కన గల 10 గ్రామ పంచాయతీలతో కూడిన నూతన మండలాన్ని ఏర్పాటు చేయాలని విన్నవించారు. మంత్రిని కలిసిన వారిలో ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ హరీశ్కుమార్, డీసీసీబీ మాజీ చైర్మన్ కొరిపెల్లి రాంకిషన్రెడ్డి, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, వైస్ ఎంపీపీ ఏనుగు లింగారెడ్డి తదితరులు ఉన్నారు.
కేటీఆర్ను కలిసిన నేతకాని నాయకులు..
ఎదులాపురం, సెప్టెంబర్ 19 : మంత్రి కేటీఆర్ను నేతకాని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేశ్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు దుర్గం శేఖర్ మర్యాద పూర్వకంగా కలిశారు. పూల మొక్కలను అందజేశారు. ఆదిలాబాద్, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు జోగు రామన్న, దుర్గం చిన్నయ్యకు మరోసారి టికెట్ కేటాయించినందుకు మంత్రి కేటీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతకానీలకు నామినేట్ పదువులు ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ కష్టపడ్డ వారికి బీఆర్ఎస్ పార్టీ కచ్చితంగా గుర్తింపు ఇస్తుందని భరోసా కల్పించారని వారు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో నేతకాని మహర్ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు జాడి రాజారెడ్డి, గోల్లె రాజమల్లు, తాళ్లపల్లి రాజేశ్వర్, శాహిని ప్రసాద్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సర్పెసొంబాయి, దుర్గం రవీందర్, దుర్గం నారాయణ, రఘునాథ్ తదితరులు ఉన్నారు.