నిర్మల్ జిల్లాలో 2721మంది, ఆదిలాబాద్ జిల్లాలో 1562 మంది విద్యార్థుల హాజరు
నిర్మల్ అర్బన్, జూన్, 30 : పాలిటెక్నిక్ కళాశాలల్లో 2022 మొదటి సంవత్సరం ప్రవేశాలకు గురువారం నిర్వహించిన పాలిసెట్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 2,975 మంది విద్యార్థులకు 2,721మంది హాజరుకాగా.. 254 మంది గైర్హాజరయ్యారని కోఆర్డినేటర్ అన్నపూర్ణ తెలిపారు. వీరందరి కోసం 10 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేశారు.
ఆదిలాబాద్ రూరల్, జూన్ 30: జిల్లాలో పాలిసెట్ 2022 ప్రశాంతంగా ముగిసిందని పాలిసెట్ కన్వీనర్ ప్రకాశ్రావ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని 6 కేంద్రాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షను నిర్వహించారు. విద్యార్థులను నిర్ణీత సమయం కంటే గంట ముందుగానే తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. మొత్తం 1729 మందికి 1562 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. బాలురలో 915 మందికి 823 మంది, బాలికల్లో 814మందికి 739 మంది హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.