భైంసాటౌన్, డిసెంబర్ 26 : మండలంలోని మీర్జాపూర్లో రూరల్ సీఐ చంద్రశేఖర్ సోమవారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి తనిఖీలు చేశారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీఐ మాట్లాడారు. నేరాల నియంత్రణఖు గ్రామాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
ప్రమాద, అత్యవసర సమయాల్లో 100కు డయల్ చేయాలని సూచించారు. చేను చుట్టూ విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయవద్దని, రక్షణగా సోలాక్ కంచెలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. మద్యం తాగి వాహనాలు నడపద్దని సూచించారు. 80 బైక్లు, 7 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐలు శ్రీకాంత్, షరీఫ్, సుమాంజలి, ఎంపీటీసీ రజాక్, వినోద్ పాల్గొన్నారు.