సారంగాపూర్, డిసెంబర్ 22: నేరాల నియంత్రణకే పోలీస్ శాఖ ఆ ధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు నిర్మల్ డీఎస్పీ జీవన్రెడ్డి తెలిపారు. మండలంలోని గోపాల్పేట్ గ్రామంలో గురువారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ గ్రా మాల్లో యువత గంజాయి, మద్యం, గుట్కా వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు అతి వేగంగా, అజాగ్రత్తగా నడపవద్దని కోరారు. వీటితో కలిగే ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ఒకవేళ ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లోకి అనుమానిత వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. తమ పై వేధింపులను మహిళలు నిర్భయంగా పోలీస్స్టేషన్లో ఫిర్యాద చేయవచ్చని పేర్కొన్నారు. యువత చదువుపై శ్రద్ధ వహించాలని, ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్లను వేస్తున్నదని చెప్పారు. వాహనాలు నడిపే వారు అన్ని ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకో వాలని సూచించారు. సరైన పత్రాలు లేని 48 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలను సీజ్ చేశారు. పలువురితో పెండింగ్ చలాన్లు కట్టించారు. నిర్మల్ రూరల్ సీఐ వెంకటేశ్, సారంగాపూర్, దిలావర్పూర్, నిర్మల్ రూరల్ ఎస్ఐలు కృష్ణసాగర్రెడ్డి, గంగాధర్, చంద్రమోహన్, సర్పంచ్ సల్లలింగవ్వ, సల్ల సాయన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.