ఇంద్రవెల్లి, జనవరి 21 ః ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో గల నాగోబా మహాపూజకు ఉపయోగించే గంగాజల సేకరణ కోసం హస్తలమడుగుకు మెస్రం వంశీయులు ఆదివారం బయలుదేరారు. ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన మెస్రం వంశీయులు మధ్యా హ్నం పురాతన నాగోబా ఆలయం(మురాడి)కి చేరుకున్నారు. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని మార్గాలపై చర్చించారు.
అనంతరం మురాడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడే భద్రపర్చిన గంగాజల ఝరిని కటోడ కోసేరావ్, నాయికివాడి ధర్ము, కటోడ హనుమంత్రావ్ బయటకు తీశారు. ఆలయం పక్కన తెల్లవస్త్రంపై ఝరిని పెట్టి సంప్రదాయం ప్రకారం పురుషులు, మహిళలు వేర్వేరుగా పూజలు చేశారు. గంగాజలం తీసుకొచ్చే ఝరిని కటోడ కోసు వీపుపై తెల్లవస్త్రంతో కట్టారు. గంగాజలం సేకరణ కోసం కాలినడకన వెళ్తున్న కటోడ కో సుతోపాటు 150 మంది మెస్రం వంశీయులు గిరిజన సంప్రదాయం ప్రకా రం మర్యాద పూర్వకంగా ఒకరినొకరు కలుసుకున్నారు.
గ్రామం నుంచి పొలిమేర వరకు గ్రామస్తులతోపాటు మె స్రం వంశీయులు వారిని సంప్రదా యం ప్రకారం సాగనంపారు. ఈ కా ర్యక్రమంలో మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్, మె స్రం వంశీయులు చిన్ను పటేల్, బాజీరావ్ పటేల్, లింబారావ్, కటోడ కోసేరావ్, కటోడ హనుమంత్ రావ్, ప ర్ధాంజీ దాదారావ్, నాయికివాడి మె్ర సం ధర్ము, పేన్ కోత్వాల్ మెస్రం తిరుపతి, గణపతి, మెస్రం మనోహర్, నా గోరావ్, జంగు పటేల్, సోనేరావ్, దేవ్రావ్, నాగ్నాథ్, తుకారాం, శేఖర్బా బు, జంగుబాపు, ఆనంద్రావ్, సీతా రాం, కార్తీక్, మారుతి పాల్గొన్నారు.