ఇంద్రవెల్లి, ఏప్రిల్ 30 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం వడగాం గ్రామంలో ఆత్రం వంశీయులు ఆదివారం పెర్సపేన్ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏజెన్సీలోని ఆయా గ్రామాలకు చెందిన ఆత్రం వంశీయులు కుటుంబ సమేతంగా వడగాం గ్రామానికి తరలివచ్చారు.
గ్రామ శివారులో ఆత్రం వంశీయులకు చెందిన కటోడ ఆత్రం షేకు, ఆత్రం శంకర్పటేల్ ఆధ్వర్యంలో పెర్సపేన్ దేవతకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆత్రం వంశీయుల పెద్దలు హనుమంత్, సీతారాం, మారుతి, మనోహర్ పాల్గొన్నారు.