ఎదులాపురం, జనవరి 18 : జైనథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టును టెర్రరిస్టులు స్వాధీనం చేసుకుంటే ఎలా నివారించాలనే అంశంపై ఆక్టోపస్ బృందం బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించింది. రెండ్రోజుల శిక్షణలో భాగంగా ఆక్టోపస్ బృందం బుధవారం ఆదిలాబాద్ జిల్లాకు వచ్చింది. కాగా, డీఎస్పీ ఎం విజయ్కుమార్ ఆధ్వర్యంలో సభ్యులు మాక్ డ్రిల్ నిర్వహించారు.
అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించి శత్రువులను త్వరగా అంతమొందించేందుకు ఇలాంటి శిక్షణ కార్యక్రమలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి తెలిపారు. ఈ బృందానికి సహాయంగా ఆదిలాబాద్ అగ్నిమాపక, ఆరోగ్యశాఖ ద్వారా అంబులెన్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ వీ ఉమేందర్, జైనథ్ సీఐ కే నరేశ్ కుమార్, ఆర్ఐ సీఐ ఎం వంశీకృష్ణ, ఎస్ఐ బీ పెర్సిస్ తదితరులు పాల్గొన్నారు.