నార్నూర్ : ఎన్నో ఆశలతో అధికారాన్ని అప్పగిస్తే అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం ( Congress Cheating ) చేసిందని నార్నూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్ ( Suresh ) అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బాకీ కార్డులతో నిరసన తెలిపి, వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో హామీలను గుర్తించి వాటి అమలు మరిచిపోయారని మండిపడ్డారు. బీ ఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో పింఛన్లు పెంచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ తోడసం నాగోరావ్, సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షుడు కనక సత్యనారాయణ, మాజీ సర్పంచులు రాథోడ్ విష్ణు, మాడవి రూప్ దేవ్, ఆడ శ్రీరామ్, రాథోడ్ పరమేశ్వర్, మాడవి సాగర్, కనక ప్రభాకర్, మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖాసిం, పట్టణ అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్, గాదిగూడ మండల మాజీ ఎంపీపీ ఆడ చంద్రకళ రాజేశ్వర్, పార్టీ అధ్యక్షుడు పూసం బాదిరావ్, మాజీ సర్పంచ్ మేస్రం జైవంత్ రావ్,మహిళలు, కార్యకర్తలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు పాల్గొన్నారు.