చెన్నూర్ రూరల్, మే 5 : ప్రతి ఇంటిలో విద్యుత్ను ఆదా చేసుకోవాలని, విద్యుత్ ప్ర మాదాలపై అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల నోడల్ ఆఫీసర్ సీజీఎం రాజు చౌహాన్ అన్నారు. ఆదివారం చెన్నూర్లో నార్తర్న్ పవర్ డిస్ట్రిబూషన్ తెలంగాణ ఆధ్వర్యంలో విద్యుత్ భద్రతా పొదుపు సూచనలతో కూడిన పోస్టర్ అధికారులతో కలిసి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులు విద్యుత్ను ఆదా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాల నివారణకు సూచనలు పోస్టర్లో ఉన్నాయన్నారు. ప్రతి గ్రామానికి ఈ పోస్టర్ వెళ్లే విధంగా చూడాలని, విద్యుత్ ఆదా చేయడంతో కలిగే ప్రయోజనాలు వినియోగదారులకు వివరించాలని అధికారులకు సూచించా రు. కార్యక్రమంలో మంచిర్యాల ఎస్ఈ శ్రావ ణ్, డీఈ కైజర్, చెన్నూర్ ఏడీఈ రవికుమార్, ఏఈలు శ్రీనివాస్, భాస్కర్, వెంకటేశ్వర్లు, భీమారం, కోటపల్లి, వేమనపల్లి, జైపూర్ ట్రాన్స్కో అధికారులు పాల్గొన్నారు.