ఎదులాపురం, ఏప్రిల్ 14: హైదరాబాద్లో 125 అడుగుల డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ, దళిత సంఘాల నాయకులు, ప్రజలు తరలివెళ్లారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయడంతో స్వచ్ఛందంగా వెళ్లారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి 750 మంది బయల్దేరి వెళ్లినట్లు జిల్లా నోడల్ అధికారి, డీఎస్సీడీవో భగత్ సునీతా కుమారి తెలిపారు. ఆదిలాబాద్కు 15 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఇందులో ఆదిలాబాద్కు 6, బోథ్కు 6 బస్సులు, ఖానాపూర్ 2, ఆసిఫాబాద్ నియోజకవర్గానికి బస్సు కేటాయించారు.
ఆదిలాబాద్కు డీపీవో శ్రీనివాస్, బోథ్ నియోజవర్గానికి డీఆర్డీవో కిషన్, ఆసిఫాబాద్కు జడ్పీఈవో గణపతిని ప్రత్యేకాధికారులుగా కేటాయించారు. ఒక్కో బస్సులో లైజన్ అధికారిగా ఎంపీవో, కానిస్టేబుల్, హెల్త్ అసిస్టెంట్, ఇద్దరు అంటెండర్లు, డ్రైవర్లు వెళ్లారు. కాగా ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావ్, మాజీ ఎంపీ జీ నగేశ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ ఆధ్వర్యంలో వీరంతా తరలివెళ్లారు. బేల మండలం నుంచి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, బీఆర్ఎస్ నాయకులు గంభీర్ఠాక్రే, ప్రమోద్ రెడ్డి, సతీశ్పవార్, వట్టిపెళ్లి ఇంద్రశేఖర్, మధుకర్, జక్కుల మధుకర్, అరుణ్, అనిల్ వెళ్లారు.
నిర్మల్ జిల్లా నుంచి..
నిర్మల్ టౌన్, ఏప్రిల్ 14: నిర్మల్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో దళిత సంఘాల నాయకులు, అధికారులు తరలివెళ్లారు. నిర్మల్ పట్టణం నుంచి మూడు బస్సుల్లో సుమారు 150 మందిని హైదరాబాద్కు తరలించారు. స్థానిక జడ్పీ కార్యాలయం వద్ద డీఆర్డీవో విజయలక్ష్మి, జడ్పీ సీఈవో సుధీర్కుమార్ ఆధ్వర్యంలో దళిత సంఘాల నాయకులు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు ముడుసు సత్యనారాయణ, రాజేశ్వర్, వెంకటస్వామి, భీంరావ్, తదితరులు పాల్గొన్నారు. మరోవైపు నిర్మల్ నుంచి మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, రేఖానాయక్, ఇతర ప్రజాప్రతినిధులంతా హైదరాబాద్లో నిర్వహించే కార్యక్రమానికి వెళ్లారు.