నిర్మల్ అర్బన్, జనవరి 26 : యువత మహ నీయుల అడుగుజాడల్లో నడవాలని నిర్మల్ ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయం, జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పోలీసు శాఖలో ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, నిర్మల్ డీఎస్పీ జీవన్ రెడ్డి, ఏవో వెంకట శేఖర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ రమేష్, సీఐలు శ్రీనివాస్, వెంకటేష్, రాంనర్సింహా రెడ్డి, సీసీఎస్ ఇన్క్టర్ శ్రీనివాస్ అధికారులు పాల్గొన్నారు.
ఎదులాపురం, జనవరి 26 : గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2020-21 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్కృష్ట సేవా పథకం, అతి ఉత్కృష్ట సేవా పథకాలను గురువారం ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి అవార్డు గ్రహీతలకు అందజేశారు.
అందుకున్న వారిలో మేకల రాధ, హెడ్ కానిస్టేబుల్ (ఆదిలాబాద్ రూరల్ పీఎస్), కామ్ల జయశ్రీ, హెడ్ కానిస్టేబుల్ (తలమడుగు), కే రామారావు, కానిస్టేబుల్ (ఇంద్రవెల్లి), సీహెచ్ రాంసింగ్, కానిస్టేబుల్ (నార్నూర్)
జె లింబాజీ, ఏఎస్ఐ (ఇచ్చోడ), జీ సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్(ట్రాఫిక్), బీ సజన్లాల్, హెడ్కానిస్టేబుల్(ఆదిలాబాద్ టూ టౌన్), ఎస్ బాలాజీ, హెడ్కానిస్టేబుల్, (ఆసిఫాబాద్), జే రామారావు కానిస్టేబుల్ (తాంసి)కి ఎస్పీ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. అలాగే అన్ని విభాగాలనందు ఉత్తమ ప్రతిభ కనబరిచిన సీఐ నుంచి హోంగార్డు స్థాయి వరకు 60 మంది అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎస్ శ్రీనివాసరావు, బీ రాములు నాయక్, ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్, డీఎస్పీలు ఉమేందర్, ఉమామహేశ్వరరావు, పోతారం శ్రీనివాస్, పోలీస్ కార్యాలయం ఏవో యూనుస్ అలీ, ఎస్బీ ఎస్ఐ అన్వర్ ఉల్ హక్, తదితరులు పాల్గొన్నారు.
యాపల్గూడలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ రెండో బెటాలియన్లో ఉత్కృష్ట సేవా పథకాలను అడిషనల్ కమాండెంట్ ఎం జయరాజు చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. ఇందులో ఎన్ రమేశ్ ఏఆర్ ఎస్ఐ, బీ గంగాధర్ ఏఆర్ ఎస్ఐ, పీ తుకారాం, ఆర్ నరేందర్, డీ రమేశ్ హెడ్ కానిస్టేబుళ్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ డీవీ నర్సింహారాజు, కేవీవీ ప్రసాద్, కృష్ణప్రసాద్, ఆర్ఐ, ఆర్ఎస్ఐలు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.