నిర్మల్ చైన్గేట్, ఫిబ్రవరి9: ఆర్థికాభివృద్ధి కోసం తీసుకున్న రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కే విజయలక్ష్మి అన్నారు. నిర్మల్లోని అంబేద్కర్ భవనంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజినల్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా బుధవారం మహిళా సంఘాలకు రూ.25 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఆర్డీవో మాట్లాడారు. మహి ళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. సంఘాల ద్వారా తీసుకున్న రుణాలతో స్వయం ఉపాధిని ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి సంఘం అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు చైర్మన్ వై శోభ, ఏపీడీ గోవిందరావు, ఏపీఎంలు, సీసీలు, మహిళలు పాల్గొన్నారు.
మామడ,ఫిబ్రవరి 9 : జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపాధిహామీలో పనులు కల్పించాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి అన్నారు. మండలంలోని దిమ్మదుర్తిలో ఉపాధిహామీ పనులను గురువారం పరిశీలించారు. ఉపాధిహామీ కూలీలతో మాట్లాడి జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం కొరిటికల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణం, పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. ఇందులో ఏపీడీ ఓస ప్రసాద్, ఏపీవో శివాజీ, ఈసీ కరీం, టీఏ కరీం, ఫీల్డ్ అసిస్టెంట్ సుధాకర్ ఉన్నారు.