ముథోల్, జూన్ 11: రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ముథోల్లోని మైనార్టీ ఫంక్షన్ హాల్ను ఆదివారం ఆయన పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన నిధులు మంజూరు చేస్తానన్నారు. ఎవరికీ ఇబ్బందులు కలుగకుండా పూర్తి స్థాయిలో అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు.
వ్యవసాయ రహదారుల పనులు ప్రారంభం
మండలంలోని తరోడా గ్రామంలో వ్యవసా య భూములకు వెళ్లేందుకు నిర్మించే రోడ్డు పనులను ఎమ్మెల్యే విఠల్రెడ్డి ప్రారంభించారు. మండలంలోని గన్నోరా గ్రామం నుంచి కారేగాం బైపాస్ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు.
జీపీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దే..
తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే చెందుతుందని ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. విఠోలి తండాలో నూతన గ్రామపంచాయతీ భవన పనులను ప్రారంభించారు. తెలంగాణ వచ్చిన తర్వాత పల్లెలు, తండా లు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని పేర్కొన్నారు. అనంతరం ఆయా గ్రామాల సర్పంచ్లు, నాయకులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనం గా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, మాజీ జడ్పీటీసీ నర్సాగౌడ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి, సర్పంచ్లు శ్వేత-రవికిరణ్ గౌడ్, విజేశ్, ఎంపీటీసీ గంగాధర్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు రాంరెడ్డి, కోఆప్షన్ సభ్యుడు మగ్దూమ్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, సమీ ఉల్లాఖాన్, బాబన్న, బోరిగాం సర్పంచ్ అమృతా మురళి, ఆయా గ్రామాల వార్డు సభ్యులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటాం..
భవన నిర్మాణ కార్మికులకు తెలంగాణ ప్రభు త్వం ఎల్లవేళలా అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ముథోల్లోని బస్వ గార్డెన్లో నియోజకవర్గ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆ ధ్వర్యంలో సదస్సు ఏర్పాటు చేశారు. దీనికి ఎమ్మె ల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభు త్వం భవన నిర్మాణ కార్మికులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదన్నారు. అనంతరం ఇటీవల మృతి చెందిన ఐదుగురు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు రూ.10 వేల చొప్పున అందజేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తామోల్ల ఐలన్న, మండలాధ్యక్షుడు ఖాసీం, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి, నాయకులు రోళ్ల రమేశ్, పోతన్న యాదవ్, శ్రీనివాస్ గౌడ్, కానమోల్ల రాజేశ్వర్, బాబన్న, కార్మిక సంఘం సభ్యులు కిశోర్, బాదుల్లా, రవీందర్ రెడ్డి, ఆయా జిల్లాలకు చెందిన అధ్యక్షులు, కార్మిక సంఘం సభ్యులు పాల్గొన్నారు.