ఆదిలాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): సబ్బండ వర్గాలకు మెరుగైన పాలన అందించేందుకు పాత, నూతన జిల్లాల్లో కలెక్టరేట్ల నిర్మాణాన్ని చేపట్టాలని రాష్ట్ర సర్కారు సంకల్పించింది. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు కూడా త్వరితగతిన ప్రజలకు చేరుతాయని భావిస్తున్నది. ఇటీవలి కాలంలో నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో సీఎం కేసీఆర్ కొత్త కలెక్టరేట్లను ప్రారంభించారు. తాజాగా శనివారం ఆదిలాబాద్ జిల్లాలో కొత్త కలెక్ట రేట్ భవన నిర్మాణ పనులు ప్రారంభమ య్యాయి. సర్వే నంబరు 72/1/6లో ప్రభుత్వం 19 ఎకరాల్లో సకల హంగులతో నిర్మిస్తున్నది. రూ.55 కోట్లతో కడుతుం డగా.. యేడాదిలోపు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజలకు మెరుగైన సే వలు అందించడంతో పాటు అన్ని ప్రభుత్వశాఖలు ఒకేచోట ఉండేలా, పూర్తి సౌకర్యాలతో ప్రభుత్వం జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లను నిర్మిస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో కూడా కొత్త కలెక్టరేట్ భవన సముదాయ నిర్మా ణ పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ, ఇతర శాఖల కార్యాలయాలు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుండంతో ప్రజలు తమ పనుల కోసం జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు వస్తారు. పలు శాఖల ఆఫీసులు దూరంగా ఉండంతో ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ప్రస్తుతం కొత్తగా నిర్మించే కార్యాలయంలో అన్ని శాఖలకు సంబంధించిన విభాగాలు అందుబాటులోకి వస్తాయి. దీంతో ప్రజలకు ఒకే చోట అధికారులను కలిసే అవకాశం లభిస్తుంది. సర్వే నంబరు 72 / 1 / 6 లోని 19 ఎకరాల్లో కొత్త కలెక్టరేట్ నిర్మిస్తున్నారు. రూ. 55 కోట్లతో అన్ని హంగులతో నిర్మించే కొత్త భవన నిర్మాణ పనులు రోడ్లు భవనా ల శాఖ ( ఆర్ అండ్ బీ) అధికారులు పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన ఓ సంస్థ పనులను చేపడుతున్నది. నిర్మాణానికి కేటాయించిన స్థలం ఎత్తు పల్లాలు ఉండడంతో యంత్రాలతో వాటిని సరిచేశారు. సిమెంట్ పనులు కూడా ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.
ఏడాదిలోగా పనుల పూర్తి
కొత్త కలెక్టరేట్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 55 కోట్లను మంజూరు చేసింది. జిల్లా అధికారుల నివాస సముదాయాలను పరిగణలోకి తీసుకుని పూర్తి నిర్మాణాలకు రూ. 69 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. కలెక్టర్ కార్యాలయం నిర్మించే భవనానికి, అధికారుల నివాస గృహాలకు మధ్య జాతీయ రహదారి ఉండడంతో ప్రస్తుతం కార్యాలయం పనులు మాత్రమే చేపట్టారు. ఏడాదిలోగా పనులు పూర్తయ్యేలా రోడ్లు భవనాల శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు రూపొందించిన ప్లాన్ ప్రకారం 1.20 లక్షల స్కేర్ ఫీట్లతో జీ ప్లస్ 2 అంతస్తులతో వివిధ కార్యాలయాల స ముదాయాలను నిర్మించనున్నారు. హెలీప్యాడ్ను భవనం ముందు ఏర్పాటు చేయనున్నారు. అన్ని రకాలతో నిర్మించే కలెక్టరేట్ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఎంతగానో ఉపయోగపడనుంది.